Site icon TeluguMirchi.com

ఓలా, బజాజ్ లకు పోటీగా మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్


దేశంలోని దాదాపు అన్ని కంపెనీలు పండుగల సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని కంపెనీలు తమ వాహనాలపై భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో మార్కెను సొంతం చేసుకునేందుకు కొన్ని కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు iVooMe(ఇవోమీ) ఎనర్జీ తన కొత్త S1 లైట్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.84,999. స్మార్ట్ ఫీచర్స్ అప్‌గ్రేడ్ ప్యాక్ కోసం రూ.4,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాంచింగ్ తో పాటు కంపెనీ దీని బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. భారతదేశంలో ఇది బజాజ్ చేతక్ 2901, Ola S1 వంటి మోడళ్లతో పోటీపడుతుంది

Exit mobile version