ఓలా, బజాజ్ లకు పోటీగా మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్


దేశంలోని దాదాపు అన్ని కంపెనీలు పండుగల సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని కంపెనీలు తమ వాహనాలపై భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో మార్కెను సొంతం చేసుకునేందుకు కొన్ని కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు iVooMe(ఇవోమీ) ఎనర్జీ తన కొత్త S1 లైట్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.84,999. స్మార్ట్ ఫీచర్స్ అప్‌గ్రేడ్ ప్యాక్ కోసం రూ.4,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాంచింగ్ తో పాటు కంపెనీ దీని బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. భారతదేశంలో ఇది బజాజ్ చేతక్ 2901, Ola S1 వంటి మోడళ్లతో పోటీపడుతుంది