బాలీవుడ్ వెళ్తున్నాడు

yuvan shankar rajaదక్షణాది టాలెంట్ ని బాలీవుడ్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ఇక్కడి నుంచి కథానాయికలు వెళ్లారు. హీరోలూ వెళ్లారు. ఇప్పుడు సాంకేతిక నిపుణులకూ పిలుపొస్తోంది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా బాలీవుడ్ ప్రయాణం కట్టాడు. ఇమ్రాన్ హష్మీ కథానాయకుడిగా యూటీవీ సంస్థ ఓ చిత్రాన్నితెరకెక్కిస్తోంది. దీనికి స్వరాలు అందించే బాధ్యత యువన్ కు అప్పగించారు. “బాలీవుడ్ మరో మెట్టులాంటిది. నా ప్రతిభకు గుర్తింఫు దక్కిందని
భావిస్తున్నా. అక్కడ కూడా నాదైన బాణీ వినిపిస్తా” అంటున్నాడు యువన్. అన్నట్టు ‘కొలవెరి డీ’తో సంచలనం సృష్టించిన అనిరుథ్ కూడా బాలీవుడ్ ఛాన్స్ అందుకొన్నాడు. మరి దక్షిణాది స్వరకర్తలకు అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.