జగన్ రిమాండ్ పొడగింపు

Jagan bail pettionఅక్రమాస్తుల ఆరోపణలతో చంచల్ గూడ జైలులో ఉన్న వైకాపా అధ్యక్షుడు కడప ఎంపి జగన్మోహన రెడ్డితో సహా పలువురికి కోర్ట్ రిమాండ్ పొడగించింది. క్విడ్‌ప్రోకో కేసులో జగన్ తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ పొడిగించారు. వీరి రిమాండ్ ను ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. మరో, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్‌ రెడ్డికి ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, అలీఖాన్‌లకు కూడా కోర్ట్ రిమాండ్ పొడిగించారు.