ఒక్క రోజు లేట్ గా వస్తున్నాయి

ramcharan-yevaduరామ్‌చ‌ర‌ణ్ హీరో గా న‌టించిన చిత్రం ఎవ‌డు. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని గీతాల‌ను ఈనెల 30న విడుద‌ల చేయాలని అనుకున్నారు. కాని ఈ డేట్ కాస్త జులై 1కి షిఫ్ట్ అయింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌. జులై 1న జరిగే ఎవడు ఆడియో వేడుకకు  చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్రలో క‌నిపిస్తున్నాడు. చరణ్, బన్ని లు పోలీస్ పాత్రలలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.