Site icon TeluguMirchi.com

టీ-సర్కార్ కు సుప్రీం షాక్!

kcr-supreemటీ-సర్కార్ కు సుప్రీం కోర్టు మరో షాక్ నిచ్చింది. ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్టు 31 లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. కౌన్సెలింగ్ నిర్వహణకు మూడు నెలల గడువు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

అంతేకాకుండా విభజన చట్టం ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాలే కౌన్సెలింగ్ కు వర్తిస్తాయని పేర్కొంది. సుప్రీం తాజా తీర్పుతో తెలంగాణలోనూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరితగతిన పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు మూడు నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరిన విషయం తెలిసిందే.

Exit mobile version