అంతేకాకుండా విభజన చట్టం ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాలే కౌన్సెలింగ్ కు వర్తిస్తాయని పేర్కొంది. సుప్రీం తాజా తీర్పుతో తెలంగాణలోనూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరితగతిన పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు మూడు నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరిన విషయం తెలిసిందే.