ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెరాస ఎంపీ విజయశాంతి ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన లోక్ సభ పరిథిలోని నియోజవర్గాల అభివృద్ది గురించి ఆమె సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. మొదక్-అక్కన్నపేట పనుల కోసం ఎంపీ కోటా నుంచి రూ. కోటి చెక్కును విజయశాంతి
సీఎంకు అందజేశారు.