విజయమ్మ చిత్రమైన ప్రశ్న

vijayammaజగన్ అరెస్టయి ఏడాదయిన సందర్భంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తల్లి విజయమ్మ ఓ చిత్రమైన ధర్మసందేహం లాంటి ప్రశ్న సంధించారు. ఆరోజు జగన్ అరెస్టయినపుడు మీరు నోరెత్తలేదు..అందుకే ఇవ్వాళ ఈ అగచాట్లు..అంటూ రాజీనామా చేసిన మంత్రులు సబితను, ధర్మానను ఉద్దేశించి అన్నారు.   ఇదదో మహాభారతంలో ద్రౌపది..తన్నోడి..నన్నోడెనా..నన్నోడి..తన్నోడెనా అన్న ప్రశ్నలా వుంది తప్ప వేరు కాదు. జగన్ చేసిన వ్యవహారాల వల్ల వీళ్ల పదవులకు ముప్పు వచ్చిందా లేక, వీళ్లు నోరు మెదపక జగన్ అరెస్టయినందున,  ఈ ఆపద వచ్చిందా అన్నది ఆలోచించాల్సి వుంది.  తమ మంత్రి పదవుల కోసం వారు వైఎస్ చెప్పినట్లు తానా తందనా అని వుండొచ్చు..అందులో తమ వాటా కూడా ఇంతో అంతో సంపాదించుకుని వుండొచ్చు. కానీ జరిగిన వ్యవహారాలన్నీ జగన్ కోసం అన్న సంగతి విజయమ్మకు తెలిసిన సంగతే. ఆమె లెక్క ప్రకారం జగన్ అరెస్టు కాగానే మంత్రులంతా గొంతెత్తి, ఇది అన్న్యాయం అని వుండాలి. కానీ అలా అని వుంటే, వారు జగన్ కు తోడదొంగలవుతారు. అలా కాకుండా ఇప్పుడు రాజీనామాలు చేసి, రేపు అరెస్టయినా బలిపశువులైనట్లవుతుంది. అప్పుడు కనీసం కొంతలో కొంతయినా ప్రజల సింపతీ  వస్తుంది. అదీ తేడా..గమనించాలి విజయమ్మగారూ.