Site icon TeluguMirchi.com

కార్యకర్తలను గుర్తిస్తేనే భవిష్యత్ : వీహెచ్

కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కలెక్టర్లతో మీటింగ్ లు నిర్వహించడం కాకుండా.. కార్యకర్తల సమావేశాలతోనే కాంగ్రెస్ బలపడుతుందన్నారు. 2014లో కాంగ్రెస్ గెలిస్తేనే నేతలకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పది మంది కేంద్రమంత్రులు ఒక్కొక్కరు రెండు జిల్లాలను తీసుకుని పార్టీకోసం పనిచేయాలని వీహెచ్ సూచించారు. ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో సీఎం ఫొటోతోపాటు ఉప ముఖ్యమంత్రి ఫొటో ఉండాల్సిందేనని లేకపోతే బడుగులు తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే తెలంగాణలో కాంగ్రెస్కు మనుగడ ఉంటుందన్నారు. జైలు బద్దలు కొట్టి జగన్ ను బయటకి తీసుకువెళ్తామని వైకాపా నేతలు అంటున్నారని…ఆయనేమన్నా గాంధీయా? అని మండిపడ్డారు దేశంలో ఎఫ్ డీఐలతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని వీహెచ్ అన్నారు.

Exit mobile version