ఈనెల 21 న ‘వేటాడు-వెంటాడు’

సంచలన కథానాయకుడు విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర ప్రేక్షకులకు అందుస్తున్న ద్విభాషా చిత్రం ‘వేటాడు-వెంటాడు’ అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసుకొని ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తిరుఎక్కడా కాంప్రమైజ్ అవకుండా దీన్ని చైనా, మలేసియా, బ్యాంకాక్ మొదలైన ప్రదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవలే జరిగింది. ఈ చిత్రం కోసం అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రి, కందికొండ వనమాలిలు వ్రాసిన గీతాలకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించింది.
‘వేటాడు-వెంటాడు’ గురించి చిత్ర నిర్మాత శ్రీనివాస్ దామెర మాట్లాడుతూ – “ఇటీవలే మేము విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన లభించింది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం హీరోగా విశాల్ కి చాలా మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఇందులో విశాల్ కి జతగా అందాల నటి త్రిష నటించింది. అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధమైన దీన్ని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సర్వసన్నాహాలు చేస్తున్నాము” అన్నారు. విశాల్, త్రిష, మనోజ్ బాజ్ పాయ్, సునయన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : రిచర్డ్, ఎడిటింగ్ : రూపన్, నిర్మాత : శ్రీనివాస్ దామెర, కథ-స్క్రీన్ ప్లే – దర్శకత్వం : తిరు.