Site icon TeluguMirchi.com

బ్యాకాంక్ లో ‘వసూల్ రాజా’

శ్రీహరి, నవదీప్, రీతూబర్మేచా కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘వసూల్ రాజా’. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. బి.యస్ స్టూడియోస్ పతాకంపై బత్తుల రతన్ పాండు, మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ చిత్రంలోని రెండు పాటలను బ్యాకాంక్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – “ నవదీప్, రీతూ బర్మేచాలపై రెండు పాటలను బ్యాకాంక్ లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరిస్తున్నాం. పాటలు చాలా బాగా వస్తున్నాయి. శేఖర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది” అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- “ ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్. శ్రీహరి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో నవదీప్ ది చాలా మాస్ క్యారెక్టర్. ఆయనకిది టైలర్ మేడ్ లా అనిపిస్తుంది. శ్రీహరి, నవదీప్ ల మధ్య సన్నివేశాలు చాలా పోటాపోటీగా ఉంటాయి. ఇందులో అయిదు పాటలున్నాయి. చిన్ని చరణ్ చక్కటి పాటలిచ్చారు. రామస్వామి సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ వారంలో పాటలను, ఈ నెల 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : కృష్ణప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జికూటివ్ : యారబాటి శివ, నృత్యాలు : శేఖర్.

Exit mobile version