నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. తొలుతు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా.. తనయుడి ఎంట్రీ జరగాలని నాగబాబు భావించారు. ఈ సినిమాకి గొల్లభామ అని నామకరణం కూడా చేశారు. అయితే నాగబాబు తన నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన వరుణ్ తొలి సినిమా బాధ్యతని పూరి జగన్నాథ్ కి అప్పగించారు. పూరి అయితే ఆ సినిమాకి మాస్ లో క్రేజ్ వస్తుందని, అది వరుణ్ కి ఓ ఫ్లాట్ ఫామ్లా ఉపయోగపడుతుందని నాగబాబు భావిస్తున్నాడు. జూన్ మొదటి వారంలో ఈసినిమా లాంఛనంగా శ్రీకారం చుట్టుకొంటదని సమాచారమ్. ఫ్లాపుల మీద ఫ్లాపులు చుట్టిముడుతున్నా ఇంకా పూరిపై నమ్మకం సడల్లేదంటే… పూరి గ్రేటే.