వంశీ సినిమా అనగానే పరవళ్లు తొక్కే గోదారి.. అందాలు కనిపిస్తుంటాయి. గోదారిని ఆయనంత అందంగా ఎవరూ చూపించలేదేమో? మరోసారి ఆయన గోదావరి తీరంలోనే షూటింగ్ చేస్తున్నారు. వంశీ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతోంది. అజ్మల్, నిఖితానారాయణ్ జంటగా నటిస్తున్నారు. పూర్ణ నిర్మాత. ఇటీవల సారధి స్టూడియోలో ఓ పాట తెరకెక్కించారు. దాంతో రెండో షెడ్యూల్ పూర్తయింది. ఈ శుక్రవారం నుంచి రాజమండ్రిలో చిత్రీకరణ మొదలుపెడతారు. అక్కడ ఓ పాట చిత్రీకరిస్తారు. ఆ తరవాత అరకు వెళ్తారు. వంశీ దర్శకత్వంలో వస్తున్న 25వ సినిమా ఇది. త్వరలోనే సినిమా పేరు ప్రకటిస్తారు.