పాపం త్రిష ను నట్టింట్లో ముంచాడు..

trishaమొదటిసారి లేడీ ఓరియంటెడ్ చిత్రం లో నటించి మోస పోయింది అందాల భామ త్రిష. ఇప్పటికే కెరియర్ ముగిసింది అనుకుంటున్నా టైం లో నాయకి చిత్రం కోలుకోలేని దెబ్బను తీసిందట. సినిమా ప్లాప్ అయ్యినందుకు పెద్దగా బాధపడడం లేదట కానీ తన మేనేజర్ తనను మోసం చేయడం తట్టుకోలేకపోతోందట. అసలు స్టోరీ లోకి వెళ్తే..

తెలుగు , తమిళం లో ఏక కాలం లో రిలీజ్ అయినా చిత్రం ‘నాయకి ‘. మొదటగా ఈ చిత్ర కథను విన్న త్రిష పెద్దగా నటించడానికి ఇష్టపడలేదట. కాకపోతే ఈ చిత్రాన్ని తన మేనేజర్ నిర్మించడం తో సినిమా లో నటించాల్సి వచ్చిందట. ఈ చిత్రానికి త్రిష రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా త‌మిళ రైట్స్ అడిగింద‌ట‌. అయితే మేనేజర్ మాత్రం త‌మిళ హ‌క్కులు కాకుండా తెలుగు హ‌క్కులు అయితే బాగా లాభం వస్తుందని మాయ మాట‌ల‌తో మోసం చేసాడట‌. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినంటూ కూడా ఎవరికీ తెలియకుండా పోవడం తో త్రిష‌కు ఏమీ మిగ‌ల‌లేద‌ట‌. కానీ తమిళ రైట్స్ తీసుకున్న మేనేజర్ మాత్రం సేఫ్ గానే ఉన్నాడట. దీంతో తనను నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడా అంటూ సన్నిహితుల దగ్గర వాపోతుందట.