Site icon TeluguMirchi.com

విచారణ 21కి వాయిదా !

Sabitha-Dharmanaదాల్మియా సిమెంట్స్ కేసులోని 21వ ఛార్జీషీట్ పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 21వ తేదికి వాయిదా వేసింది. అయితే, ఇటీవలే తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సబిత, ధర్మాన ప్రసాదరావులను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని.. సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో కీలక నిందులుగా ఉన్న వీరిని విచారిస్తే కీలక సమాచారం అందుతుందని సీబీఐ కోర్టుకు విన్నవించింది. సీబీఐ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దీంతో.. ఈ మాజీ
మంత్రులిద్దరు ప్రస్తుతానికి ఊపిరిపీల్చుకున్నప్పటికినీ.. భవిష్యత్ లో వీరిపై సీబీఐ మరింత గట్టిగా ఉచ్చుబిగించవచ్చని తెలుస్తోంది.

Exit mobile version