దట్ ఈజ్ అరుణాచలం !

arunachalamసి బి ఐ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ జాయింట్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జె డి అరుణాచలం మొదటి రోజునే
మీడియా కు ఝలక్ ఇచ్చారు. డ్యూటి లో జాయిన్ అయిన అరుణాచలం ను ఫార్మల్ గా పలకరించేందుకు మీడియా
పెద్ద సంఖ్యలో ఆయన ఆఫీసు వద్దకు చేరారు. ” ప్రస్తుతం వున్న జటిలమైన కేసులను ఎలా డీల్ చేయబోతున్నారు ?”లాంటి ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమైపోయారు. కాని మీడియా ను చూడగానే అరుణాచలం కస్సుమన్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ” అసలు మీడియా వాళ్ళను ఇక్కడిదాకా రానిచ్చిందేవరు ? ” అంటూ అక్కడి సిబ్బందిపై ఆయన  చిర్రు బుర్రు లాడారు. వీళ్ళను పంపేయండి అంటూ హుకుం జారీ చేసారు. మరోసారి ఇలా జరిగితే సహించను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చి తన చాంబర్ లోకి వెళ్ళిపోయారు. సంచలనాలు సృష్టించిన జె డి లక్ష్మినారాయణ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన అధికారి కావటం వల్ల సహజంగానే మీడియా కు అరుణాచలం విషయంలో కొద్దిపాటి ఆసక్తి వుంటుంది. ఇప్పుడే ఇలా వుంటే ముందు ముందు ఎలా వుంటుందో అని మీడియా వారు తలలు పట్టుకుంటున్నారు.