అధిష్టానం ఆదేశిస్తే… పోటీచేస్తాడట !

taraka-ratnaసినీ నటుడు నందమూరి తారకరత్న తన మనసులోని మాట బయటపెట్టాడు. తిరుమలలోని తుమ్మల గుంట శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వచ్చిన తారక రత్న మాట్లాడుతూ.. అధిష్ఠానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మనసులోని మాట బయటపెట్టాడు. ఇప్పటికైతే మావయ్యే సీఎం అభ్యర్ధి అన్న తారకరత్న.. బాబాయ్ సేవలు పార్టీకి అవసరమని అభిప్రాయపడ్డాడు. మహానాడు అంటే తెలుగు దేశం కుటుంబసభ్యుల పండగని, దానికి ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలకాల్సిన అవసరం లేదన్నారు.