తెలంగాణ ఎంపీలకు చేదు అనుభవం..!

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పాసులు లేవంటూ పోలీసులు సదస్సుకు అనుమతించకపోవడం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో పోలీసులకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం జరిగింది.పోలీసుల తీరుపై టి కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎంపీలను, పోలీసులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఎంపీలు తెలంగాణ బ్యాడ్జీలు ధరించి వచ్చారు. రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు మంత్రుల గ్యాలరీలో కూర్చోవడం అందర్ని ఆకర్షించిందని సమాచారం.