Site icon TeluguMirchi.com

హైకమాండ్ కు టీ మంత్రుల హెచ్చరిక

Telangana-Ministersతెలంగాణ అంశంపై టీ మంత్రులు తమ అధిష్టానానికి గట్టి హెచ్చరికలు పంపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ఆలోచన ఉండకూడదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఘాటైన లేఖ రాశారు. ఈ నెల 28 న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్ఫష్టమైన నిర్ణయం తీసుకోవాలని అధినేత్రిని కోరారు. తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం అఖిలపక్ష సమావేశంలో తీసుకోలేకపోతే ప్రభుత్వానికి, అవసరమైతే పార్టీకి సైతం దూరంగా ఉండటానికి వెనకాడబోమని తెలంగాణ మంత్రులు సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైకమాండ్‌కు డెడ్‌లైన్‌గా చెప్పవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పీసీసీ చీఫ్ బొత్సతో కూడా దాదాపు ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు. అఖిలపక్షానికి పార్టీ నుంచి ఒక్కరినే పంపాలని, ఇద్దరిని పంపినా అభిప్రాయం ఒక్కటే ఉండాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఈరోజు గాంధీభవన్‌లో మంత్రులు బొత్సను కలసి తమ అభిప్రాయాన్ని, కార్యచరణను వివరించారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీ మంత్రులు బొత్సను కోరారు. అఖిలపక్షానికి షిండే ఇద్దరిని పిలవడంపై తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

Exit mobile version