హైదరాబాదులో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. బస్సులు యధాతథంగా నడుపుతున్నారు. కుషాయిగూడ, ఉప్పల్, హయత్ నగర్ ఆర్టీసీ డిపోలనుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీర్ని అరెస్టుచేసి బస్సులను నడుపుతున్నారు. మరో వైపు వరంగల్ జిల్లా హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ మరియు వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతుందని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళన కారులను అదుపులోనికి తీసుకుంటున్నట్లు సమాచారం.