Site icon TeluguMirchi.com

బంద్ పాక్షికమే..!

telangana-bandhతెరాస అధినేత కేసీఆర్ పులుపు మేరకు నేడు తెలంగాణ జిల్లాలలో బంద్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా బంద్ పాటిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా బంద్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బంద్ లో పాల్గొంటున్న తెరాస నేతలను పోలీసులు అదుపులోని తీసుకుంటున్నారు.

హైదరాబాదులో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. బస్సులు యధాతథంగా నడుపుతున్నారు.  కుషాయిగూడ, ఉప్పల్, హయత్ నగర్ ఆర్టీసీ డిపోలనుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీర్ని అరెస్టుచేసి బస్సులను నడుపుతున్నారు. మరో వైపు వరంగల్ జిల్లా హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ మరియు వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతుందని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళన కారులను అదుపులోనికి తీసుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version