రేపు తెలంగాణ బంద్ !

kcrతెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరించిన అక్రమ అరెస్ట్ లు, అనచివేతలకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని తెరాస అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ఛలో అసెంబ్లీ’కి వేలాదిగా తరలివస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేసీఆర్ ఖండిచారు. జేఏసీ మరియు తెరాస ఎమ్మెల్యేలు, కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికమని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే, కేసీఆర్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు పలు సంఘాలు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు ఓయూ జేఏసీ సైతం రేపు తెలంగాణ బందుకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.