Site icon TeluguMirchi.com

“ఛలో అసెంబ్లీ”కి తెదేపా మద్దతు !

తెలంగాణ రాజకీయ జేఏసీ ఈ నెల 14న తలపెట్టిన “ఛలో అసెంబ్లీ”కి తెదేపా సంపూర్ణ మద్ధతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఓ ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మోత్కుపల్లి విలేకరులతో మాట్లాడుతూ.. టీ-జేఏసీ తలపెట్టిన ’ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులంతా పాల్గొంటాయని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో అన్నీ పార్టీలను కలుపుకొని పోవాల్సిన ఐకాస ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు. కాగా, మహానాడులోని తెలంగాణపై తెదేపా స్పష్టమైన వైఖరితో తీర్మాణం చేసిందని మోత్కుపల్లి మరోసారి స్పష్టం చేశారు.

Exit mobile version