విద్యుత్ సమస్యలపై తెదేపా ఆందోళన !

TDP-electricity-protestరాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు ఈరోజు (మంగళవారం) గన్ పార్క్ ఆందోళనకు దిగారు. జిల్లాల వారీగా విద్యుత్ సంక్షోభంపై సేకరించిన కోటికి పైగా సంతకాలను ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. సర్ ఛార్జీల రద్దుతో పాటు, రైతులకు 9 గంటల కరెంట్ ను ఇవ్వాలని తెదేపా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వల్ల పరిశ్రమలు కర్ణాటకు తరలిపోతున్నాయని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెదేపా ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.