Site icon TeluguMirchi.com

మంత్రులతో భేటికి టి.ఎంపీలు దూరం

telangana-congress-mpsతెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తొలిసారిగా అధిష్టానంపై ధిక్కార ధోరణి ప్రదర్శించారు. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్ లు ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించినట్లు సమాచారం. పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని ఎంపీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు మాత్రం ఎఫ్ డీఐలకు అనుకూలంగా ఓటేసేందుకు ఎంపీలను బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version