స్వామిగౌడ్ అరెస్ట్..!

Swamy-Goudతెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో… నగరంలో తెలంగాణవాదుల అరెస్టల పర్వం కొనసాగుతోంది. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ సహా పలువురు నేతలను జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో పోలీసులు
ఈరోజు (శుక్రవారం) అదుపులోనికి తీసుకున్నారు.  కాగా రామాంతపూర్ లో బీజేపీ నేతలు ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్, హనుమంతరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు నిజామాబాద్ మండలం మాచారెడ్డి మండలం పాల్వంచలో 30మంది తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎవరు బయటి
రావద్దని.. ఛలో అసెంబ్లీలో పాల్గొనవద్దని, పాల్గొన్న యెడల కఠనమైన కేసులను ఎదుర్కొవలసి వస్తుందని సీపీ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.