మిస్టర్‌ అమృతరావ్‌ గా సునీల్‌

అప్పట్లో అన్ని వర్గాల బుల్లితెర ప్రేక్షకులకి కితకితలు పెడుతూ నాన్ స్టాప్ గా నవ్వించిన సీరియల్ ‘అమృతం’. ఈ సీరియల్ అనూహ్యమైన ఆదరణ పొందింది. జస్ట్ ఎల్లో బ్యానర్ పై గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సీరియల్ సినిమాగా రాబోతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయిందట. పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచేలా ఉన్న ఈ సీరియల్ సినిమా వెర్షన్ కి కథానాయకుడిగా సునీల్ ఎంపికయ్యాడని విశ్వసనీయమైన సమాచారముంది. జస్ట్ ఎల్లో వారితో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందనీ … గుణ్ణం గంగరాజే దర్శకుడిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అధికారికంగా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశముందని తెలిసింది. ‘పూలరంగడు’ సినిమా హిట్ తరువాత హాస్యనటుడు సునీల్ ‘తను వెడ్స్ మను’ తెలుగు రీమేక్ లో ప్రస్తుతం నటిస్తున్నాడు.