Site icon TeluguMirchi.com

యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు..!

special-trains-for-uttarakhఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న యాత్రికులను తమ తమ స్వస్థలాలకు చేర్చేందు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఢిల్లీ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్ కు రైళ్లను నడిపిస్తున్నారు. అలాగే కాజీపేట-విశాఖ పట్నం, విశాఖపట్నం-సూళ్లూరు పేట, సికింద్రాబాద్-గుంతకల్ లకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయితే, బధితులకు ఉచిత బోజనం, ఉచిత ప్రయాణం అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కాగా, యాత్రలో చిక్కుకున్న వేలాది యాత్రికులను ప్రభుత్వ బలగాలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరవేసిన విషయం తెలిసిందే.

Exit mobile version