యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు..!

special-trains-for-uttarakhఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న యాత్రికులను తమ తమ స్వస్థలాలకు చేర్చేందు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఢిల్లీ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్ కు రైళ్లను నడిపిస్తున్నారు. అలాగే కాజీపేట-విశాఖ పట్నం, విశాఖపట్నం-సూళ్లూరు పేట, సికింద్రాబాద్-గుంతకల్ లకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయితే, బధితులకు ఉచిత బోజనం, ఉచిత ప్రయాణం అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కాగా, యాత్రలో చిక్కుకున్న వేలాది యాత్రికులను ప్రభుత్వ బలగాలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరవేసిన విషయం తెలిసిందే.