Site icon TeluguMirchi.com

‘ఛలో అసెంబ్లీ’పై అధినేత్రి ఆరా..!

Soniaతెలంగాణ రాజకీయ ఐకాస చేపట్టిన “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ కొద్ది సేపటి క్రితం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, గులాంనబీ ఆజాద్ తో సమావేశమయ్యారు. తెలంగాణ అంశం, తాజాగా, ఛలో అసెంబ్లీతో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎప్పటికప్పుడు రాష్త్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను గమనిస్తూ.. ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం గుసగుసలాడుతున్నారు.

Exit mobile version