Site icon TeluguMirchi.com

టీ కాంగ్రెస్‌ ఎంపీలకు దొరికిన అమ్మగారి దర్శనభాగ్యం

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎట్టకేలకు తమ ఖాతాలో ఓ విజయం లాంటి విజయాన్ని నమోదు చేసుకోగలిగారు. ఎఫ్‌.డీ.ఐ లపై పార్లమెంట్‌ లో తలెత్తిన ఓటింగ్‌ విషయంలో మొరాయించి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారు చేయించుకోగలిగారు. తాజాగా ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న అమ్మగారి దర్శనభాగ్యం కూడా దొరికించుకోవడంలో సఫలమయ్యారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అంశం, డిసెంబర్‌ 28ని ముహూర్తంగా నిర్ణయించిన అఖిలపక్ష భేటీపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు.

Exit mobile version