Site icon TeluguMirchi.com

డ్రెహాడూన్ కు వెళ్లనున్న షిండే

shindeఉత్తరాఖండ్ వరద సహాయక చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈరోజు (శుక్రవారం) డెహ్రాడూన్ వెళ్లనున్నారు. అలాగే షిండే తో పాటుగా నేషనల్ డిజాస్టర్స్ మెనేజ్ మెంట్ (ఎన్ డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా డెహ్రాడూన్ లో పర్యటించనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో.. సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కేదార్ నాథ్ పరిసర ప్రాంతాల్లో సైన్యం రసాయనాలను చల్లోతోంది.

Exit mobile version