నక్సల్ సమస్యపై కఠన వైఖరి : షిండే

shinde-delhi gang rapeఛత్తీస్ గఢ్ లోని జగ్ దల్ పూర్ సమీపంలో ఇటీవల కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ పై మావోలు జరిపిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో దేశ అంతర్గత భద్రపై జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో షిండే మాట్లాడుతూ.. నక్సల్ సమస్యపై కఠిన వైఖరితో ఉంటామని స్పష్టం చేశారు. కాగా, దేశంలో శాంతిభద్రతలు నియంత్రణలోనే ఉన్నాయని షిండే పేర్కొన్నారు.