Site icon TeluguMirchi.com

ఛత్తీస్ గఢ్ ఘటన.. ఉగ్రవాదం కంటే తీవ్రమైంది

Shindeఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకున్న మావోయిస్టుల దాడి.. ఉగ్రవాదం కంటే తీవ్రమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ఈరోజు (శుక్రవారం) ఛతీస్ గఢ్ పర్యటనకు వచ్చిన షిండే విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. భద్రతాపరమైన లోపాలువున్నాయన్న అంశంపై ఆరాతీస్తున్నామని, నక్సల్స్ చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు. కాగా, ఛత్తీస్ గఢ్ ఘటన చోటుచేసుకున్నప్పుడు షిండే విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version