బీజేపీతోనే తెలంగాణ సాధ్యం !

telanganaప్రత్యేక తెలంగాణ రాష్ట్రం భాజపాతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సురేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీయే 2014లో నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్రంలో అధికారంలోనికి రాగానే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో భాజపా బలపడుతుండంతో.. తెరాస గుండెల్లో గుబులు మొదలైయిందని ఆయన అన్నారు. ఎప్పటికైనా.. తెరాస కాంగ్రెస్ లో విలీనమయ్య్యే పార్టీయేనన్నారు