డిసెంబర్ 21న సారొస్తున్నారు!

రవితేజ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రై.లి. సంస్థ పరశురామ్ దర్శకత్వంలో నిర్మించిన ‘సారొచ్చారు’ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సంద్రర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంకదత్ మాట్లాడుతూ.. సోలో లాంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు పరశురామ్ ఈ చిత్రంతో మరింత పేరు తెచ్చుకోనున్నట్లు నిర్మాత ప్రియాంకదత్ చెప్పారు. ‘దేవి శ్రీ ప్రసాద్ 51వ చిత్రంగా విడుదలైన మా సినిమా ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రవితేజ నటన ప్రతిఒక్కరినీ అలరిస్తుంది. దర్శకుడు పరశురామ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. కాజల్, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాశ్, ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి, ఫైట్స్: రామలక్ష్హణ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వైజయంతి, నిర్మాత: ప్రియాంకదత్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్.