Site icon TeluguMirchi.com

నవంబర్ 30 న రాబోతున్న “సారొచ్చారు” ఆడియో

ఎంతో కాలంగా హిట్‌ కోసం పరితపిస్తున్న హీరో మాస్‌ మహారాజా రవితేజ. అలాగే ఎన్నో అద్వితీయ విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకున్నప్పటికీ ఇటీవలి కాలంలో హిట్లు లేక సతమతమవుతున్న బ్యానర్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ సారథ్యంలోని “వైజయంతీ మూవీస్‌”. ఇప్పుడు తాజాగా రవితేజ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా వైజయంతీ మూవీస్‌ బేనర్‌ పై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న చిత్రం “సారొచ్చారు”. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా యువత ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మరోసారి రవితేజకు హీరోగా, అశ్వినీదత్‌ కు నిర్మాతగా, ఇప్పటికే నారా రోహిత్ “సోలో”తో తొలి విజయం అందుకున్న పరశురామ్ సక్సెస్‌ తప్పకుండా వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “సారొచ్చారు” చిత్రం ఆడియో ఈ నెల 30న విడుదల కాబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన స్వరాలందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Exit mobile version