Site icon TeluguMirchi.com

సి.ఎమ్ వ్యతిరేకంగా సుప్రీంకు వెళతా!

sankar-raoముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర రావు మరో సారి రెచ్చిపోయారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరిగాయని మండిపడ్డ శంకరన్న కిరణ్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుమారు నలబై మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారని వెల్లడించారు. కిరణ్ సీఎం కాగానే పదిహేడు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వదిలి వెళ్లారని, పదహారు మంది పార్టీకి గుడ్‌బై చెప్పారని తెలిపారు. నిన్న ఇద్దరు ఎంపీలు వివేక్, మందాలు పార్టీ నుంచి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని అడిగే వాళ్లే లేకుండా చేశాడని ఆరోపించారు. ఇక కిరణ్ హయాంలో విడుదలైన ఎర్రచందనం జీవోపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన శంకర్ రావు విషయమై గత ఏడాది జూలై 10న హైకోర్టులో కేసు వేశానని చెప్పారు. ఈ విషయం పై త్వరలోనే సుప్రీంకోర్టును, సీబీఐ, ఈడీలను ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

Exit mobile version