Site icon TeluguMirchi.com

రాష్ట్రం ఒక్కటిగానే వుంటుంది!

shilajanathతన సమైక్యవాదాన్ని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ మరోసారి గట్టిగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడలేదని, రాష్ట్రం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుందని చెప్పారు. రాష్ట్రం విడిపోదని, భాషా ప్రయుక్త రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి ప్రవేశించిందని నొక్కి చెప్పారు. ఇక చిన్నరాష్ట్రాల వల్ల పురోగతి అసాధ్యమని అంటూ, కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న పిమ్మటే నిర్ణయం వెలిబుచ్చుతుందని పేర్కొన్నారు.

Exit mobile version