స్పందించిన.. సబిత !

Sabitha Indra Reddyజగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తన పై వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో ఓ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటపడతానని అన్నారు. తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకముందని ఆమె అన్నారు. అయితే, ఇక నుంచి ఓ కార్యకర్తగా పార్టీ ప్రతిష్ట పెంచే దిశగా పనిచేస్తానని సబిత అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జిషీట్ లో ఏ4 గా నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సబిత రాజీనామాను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే.