మనం సినిమాలో రేఖ కనిపిస్తుందా? అక్కినేని నాగేశ్వరరావుతో జోడీ కట్టబోతోందా? గత కొంతకాలంగా ఈ వార్తే టాలీవుడ్లో చక్కర్లు కొట్టింది. అక్కినేని కథానాయకులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న చిత్రం మనం. విక్రమ్ కుమార్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అక్కినేని భార్యగా రేఖ నటిస్తుందని చెప్పుకొన్నారు. కానీ ఈ సినిమాలో రేఖ నటించడం లేదట. అసలు అక్కినేనికి ఈ సినిమాలో జోడీనే లేదట. ఇందులో శ్రియ, సమంత కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రానికి అనూప్ స్వరాలు అందిస్తున్నాడు.