ఒకప్పటి కలల సుందరి రేఖ ఇప్పుడు తెలుగులో నటిస్తోందా..? ఆ అవకాశాలున్నాయి అంటున్నారు ఫిల్మ్నగర్ వర్గాలు. మనం సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం రేఖను సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కినేని కథానాయకులు నటిస్తున్న చిత్రం మనం. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ, సమంత కథానాయికలు. అక్కినేని నాగేశ్వరరావు జోడీగా రే్ఖ నటిస్తు ఎలా ఉంటుంది? అనే దిశగా చిత్రవర్గాలు ఆలోచిస్తున్నాయట. మరోవైపు రేఖనీ సంప్రదిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రేఖ ఎంట్రీ ఇస్తే మరింత క్రేజీగా ఉంటుంది కదూ…?!