నేడు పాక్ హోమంత్రి రెహ్మాన్ భారత్ పర్యటన

పాకిస్థాన్ హోం శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ రోజు భారత్ కు రానున్నారు. సాయంత్రం ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారుల చర్చల అనంతరం కేంద్ర హోంమంత్రి షిండేతో కలిసి మాలిక్ భారత్-పాక్ విసా సరళీకరణ ఒప్పందంపై సంయుక్తంగా ప్రకటన చేయనున్నారు. అనంతరం మాలిక్ గౌరవార్థం షిండే ఇచ్చే విందు స్వీకరిస్తారు. రేపు ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాలిక్ భేటీ కానున్నారు. లోక్ సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతసలహాదారు శివ్ శంకర్ మీనన్ లతో ఆయన సమావేశమై ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.