స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధమవుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ప్రస్తుత ఎన్నికల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. అయితే, రాష్ట్రంలో 40 లక్షల నకిలీ ఓట్లున్నాయని, 2014 సాధరణ ఎన్నికలలోపు నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తామని బన్వర్ లాల్ సష్టం చేశారు.