ఎవ‌డు ఆడియో డేట్ ఫిక్స్

ramcharan yevaduరామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఎవ‌డు. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని గీతాల‌ను ఈనెల 30న విడుద‌ల చేయ‌నున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌. 30వ తేదీ సాయింత్రం 6 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని శిల్పక‌ళావేదిక‌లో పాట‌ల్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. అల్లు అర్జున్ ఓ కీల‌క‌మైన పాత్రలో క‌నిపిస్తున్నాడు. బ‌న్నీది పోలీస్ క్యారెక్ట‌ర్ అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు… హాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్‌కీ ఈ సినిమాకీ ద‌గ్గర పోలిక‌లు ఉన్నాయ‌ట‌. వాటిలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.