చూడటానికి అభిమానులు షూటింగ్ జరుగుతున్న లోకేషన్ లో బారులు తీరుతున్నారని టీం సభ్యులు తెలిపారు. గతంలో ప్రియాంక చోప్రా అపురూపం అనే తెలుగు చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు జంజీర్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ప్రియాంక. ప్రస్తుతం చరణ్, సంజయ్ దత్, ప్రియాంక, సోను సూద్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జంజీర్ ను తెలుగు, హిందీ బాషల్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.