ఎవడి మాటా వినొద్దు – మనిషి మాట అస్సలు వినొద్దు అంటూ హితోపదేశం చేశాడు బిజినెస్మేన్లోని సూర్య. ఈ సినిమా అంతా మహేష్బాబు వన్మేన్ షోనే. అతని మాటలు, మేనరిజం… ఇవన్నీ భలే నచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్కి తీసుకెళ్తున్నాడు పూరి జగన్నాథ్. అక్కడ రణబీర్ కపూర్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. అంతేకాదు… అభిషేక్ బచ్చన్తోనూ ఓ సినిమా చేస్తాడట. ”బాలీవుడ్లో ఉన్న సౌకర్యాలతో అక్కడ కేవలం నెల రోజులకో సినిమా తీసేయొచ్చు. చేతిలో స్ర్కిప్టు ఉండాలంతే..” అంటున్నాడు పూరి. మొత్తమ్మీద పూరి బాలీవుడ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్నాడు.