Site icon TeluguMirchi.com

ప్రిన్స్ మెచ్చిన “కృష్ణం వందే జగద్గురుమ్ “

దగ్గుపాటి రానా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “కృష్ణం వందే జగద్గురుమ్ ” మూడు రోజుల క్రితం ప్రేక్షకులముందుకు వచ్చి అన్ని వర్ఘాల ప్రేక్షకులనీ అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ బాబు చూశారు. ఈ చిత్రం మహేష్ కు చాలా నచ్చిందని సమాచారం. సినిమా చూసిన తరువాత మహేష్ స్పందిస్తూ… “కృష్ణం వందే జగద్గురుమ్ అవుట్ స్టాండింగా ఉంది. సినిమా మొత్తం ఎంజాయ్ చేసాను. క్రిష్ కి, రానాకి,మరియు చిత్రానికి పనిచేసిన యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్”, అని ట్విట్టర్ లో తన అభిందనలను తెలిపారు. ఇక మహేష్ బాబు-దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత క్రిష్ – ప్రిన్స్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం మొదలౌతుంది. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయం తో తెరకెక్కించబొతున్నట్లు సమాచారం.

Exit mobile version