రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇప్పటికే దాదాపుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇది చారిత్రాత్మక నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 80కోట్ల పైమాటేనట. దీనికి తోడు ఇప్పుడు మరో చర్చ కూడా ఈ సినిమా గురించి తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాజమౌళి చిత్రం “ఈగ” తమిళంలో “నాన్ ఈ” పేరిట, హిందీలో “మఖ్ఖీ” పేరుతో విడుదలవడం.. రెండు చోట్లా భారీ హిట్ అయిపోవడంతో రాజమౌళి తన తాజాచిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా తీయబోతున్నాడని సమాచారం. ప్రభాస్ ఈ చిత్రంతో బాలీవుడ్, కోలీవుడ్ లలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న మాట. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ డెబ్యూ ఇవ్వడానికి రెండుభాషల్లోనూ అంటే తమిళం మరియు హిందీల్లో ఈ సినిమా ఒక మంచి ప్లాట్ ఫాం అవుతుందనే చెప్పుకోవాలి. ఇటీవలే ప్రభాస్-రాజమౌళి ల తొలి చిత్రం “ఛత్రపతి” తమిళంలోకి డబ్ అయి బాగానే ఆడినట్టు సమాచారం. అలాగే రాజమౌళి సినిమాల్లో చాలావరకు తమిళం, హిందీల్లోకి రీమేక్ కూడా అయి సక్సెస్ లుగా నిలిచాయి. తాజా ఉదాహరణలుగా హిందీలో విక్రమార్కుడు రీమేక్ గా వచ్చిన “రౌడీ రాథోడ్”, అలాగే “మర్యాద రామన్న” కు రీమేక్ గా అజయ్ దేవగణ్ నటించిన “సన్ ఆఫ్ సర్దార్” .. ఈ రెండూ బాలీవుడ్ లో పెద్ద హిట్ చిత్రాలన్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి ఈ త్రిభాషా చిత్రానికి శ్రీకారం చుట్టడం వెనుక నిజముండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఈ త్రిభాషా చిత్రం కోసం ఓ పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ తో పాటుగా మరి కొందరు బాలీవుడ్ ఆర్టిస్టులను కూడా సంప్రదిస్తున్నట్టు తెలిసింది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రాన్ని డబ్బింగ్ లా కాకుండా డైరెక్ట్ చిత్రాల్లా ఉండేల్లా అంటే మూడు భాషలకు సంబంధించి షూటింగ్ జరపాలని నిర్ణయించాడట. అంటే మరీ వివరంగా చెప్పాలంటే గౌతం మీనన్ స్టైల్లో చిత్రీకరించబోతున్నాడట. ఏం మాయ చేశావే చిత్రాన్ని ఒకేసారి చైతూ-సమంత అండ్ శ్మ్బు-త్రిష జోడీలతో, అలాగే “ఎటో వెళ్ళిపోయింది మనసు” చిత్రాన్ని ఒకేసారి నాని-సమంత అండ్ జీవా-సమంత జంటలతో షూట్ చేసినట్టన్న మాట. సో, త్వరలో మన టాలీవుడ్ “డార్లింగ్” మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లలో పాపులర్ అయిపోతాడన్నమాట!