క్రీడలను రాజకీయాలతో కలపకండి !

manmohan-singhఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు స్పందించారు. స్పాట్ ఫిక్సింగ్ పై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు మన్మోహన్ స్పందిస్తూ… క్రీడలను, రాజకీయాలను కలిపి చూడకండని చెప్పారు. రాజకీయాలు, క్రీడలు రెండూ వేర్వేరన్న మన్మోహన్.. విచారణ జరుగుతున్నందున దానిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండదని ప్రధాని వ్యాఖ్యానించారు. లెప్ట్, తృణమూల్ పార్టీలతో పొత్తులపై ఆయన పైవిధంగా స్పందించారు. మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మన్మోహన్ వెల్లడించారు.