పాయల్ విలనట..

ఆర్ఎక్స్ 100 చిత్రంతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న పాయల్..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉంది. యంగ్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడి కడుతుంది. ప్రస్తుతం వెంకీ సరసన వెంకీమామ చిత్రంలో ..రవితేజ నటిస్తున్న డిస్కో రాజా మూవీ లో నటిస్తుంది. ఈ రెండు కాక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ నటిస్తుంది.

ఈ బయోపిక్ లో పాయల్ వేశ్య పాత్రలో నటించడమే కాదు ఈ సినిమాలో విలన్ కూడా ఆమెనట. టైగర్ నాగేశ్వరరావు పోలీసులకు పట్టుపడటానికి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఓ వేశ్య మహిళే కారణం అనేది స్థానిక ప్రజలు చెప్పే మాట. పోలీసులతో కుమ్మకైన ఆమె నాగేశ్వరరావు కి మత్తు మందు ఇచ్చి ఆయన దొరికిపోయేలా చేస్తుందట. ఆ రోల్ లోనే పాయల్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.